Sunday, 10 March 2019

చైనాలో భారత్‌ మూడో ఐటీ కారిడార్‌

భారత్‌, చైనా కంపెనీలు భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం సులభతరం చేసేందుకు వీలుగా చైనాలో భారత్‌ మూడో ఐటీ కారిడార్‌ను ప్రారంభించింది. ఐటీ కారిడార్‌ అభివృద్ధికి జియాంగ్జు ప్రావిన్స్‌లోని సుగ్జూ నగరంతో ఐటీ పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల దూసుకుపోతున్న చైనా ఐటీ విపణి నుంచి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇటువంటి కారిడార్‌లనే దాలియన్‌, గుయాంగ్‌ నగరాల్లో నాస్‌కామ్‌ ఇప్పటికే ప్రారంభించింది. చైనాలో ఇటువంటి చర్యల ద్వారా 300కు పైగా కంపెనీలు అవకాశాలు దక్కించుకున్నాయి. దాలియన్‌, గుయాంగ్‌ ఐటీ కారిడార్‌ల ద్వారా భారత ఐటీ కంపెనీలు వరుసగా 4.6 మిలియన్‌ డాలర్లు, 8.9 మిలియన్‌ డాలర్ల చొప్పున ఆర్డర్లు పొందాయి. 

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...