Thursday, 12 September 2019

విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం.. మూడేళ్లలోనే రెట్టింపు.. అక్టోబరు 2 నుంచి దీనిపై పోరాటానికి కేంద్రం నిర్ణయం. నేటి నుంచి స్వచ్ఛత సేవ కార్యక్రమానికి శ్రీకారం


i.          దేశంలో ప్లాస్టిక్వాడకం ఏటికేడాది పెరుగుతోంది. 2001తో పోలిస్తే 2017 నాటికి 60 రెట్లు పెరిగింది. దీని తయారీలో వాడే పాలిథిన్మట్టిలో కలిసిపోదు. నీటిని భూమిలోకి ఇంకనివ్వదు. దీనిని కాలిస్తే వెలువడే విషవాయువులతో శ్వాసకోశ జబ్బులు వస్తాయి.
ii.      తెలంగాణలో పోగవుతున్న ప్లాస్టిక్వ్యర్థాల మొత్తం 2016లో 1.20 లక్షల టన్నులుంటే.. ఇప్పుడది దాదాపు 2.50 లక్షల టన్నులకు పెరిగింది.
iii.     మట్టిలో పారేసినా అందులో కలిసిపోని ఘనవ్యర్థం ప్లాస్టిక్‌. 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్మట్టిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాలకుపైనే పడుతుంది.
iv.     ప్లాస్టిక్వ్యర్థాల సమస్యను గుర్తించిన కేంద్రం నివారణపై దృష్టి పెట్టింది. ‘పర్యావరణ పరిరక్షణకోసంప్టాస్టిక్వ్యర్థాల వ్యతిరేక ఉద్యమంచేపట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
v.       బుధవారం (September 11) నుంచిస్వచ్ఛతసేవకార్యక్రమం ప్రారంభించి.. అక్టోబరు 2 నుంచి ప్లాస్టిక్పై పోరాటానికి శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు.


No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...