Tuesday, 25 June 2019

మహిళా టెన్నిస్ నెం. 1 యాష్లే బార్టీ

ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో 2019 జూన్ 24 ప్రకారం మహిళల సింగిల్స్ లో  యాష్లే బార్టీ నెం. 1 ర్యాంక్ స్థానాన్ని సాధించినది
* ఈ ఘనతని సాధించిన 2వ ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి బార్టీ 2019
*ఈ ఘనతని సాధించిన తొలి ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి - ఇవాన్ గూలగాంగ్ కాలే (1976)
*ఇటీవల బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో కూడా విజేతగా నిలిచింది. 

1988 మోటార్ వెహికల్ చట్టానికి సవరణలు

ఈ చట్ట సవరణ బిల్లుని కేంద్ర మంత్రివర్గం 2019 జూన్ 24న ఆమోదించింది. దీని ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలపై  జరిమానాలని రెట్టింపు చేసింది. 
  • లైసెన్సు లేకుండా నడిపితే - 5000
  • అతి వేగం-2000
  • ప్రమాదకరంగా - 5000
  • మద్యం మత్తులో - 10,000
  • హెల్మెట్ లేకుండా - 1000+ 3 నెలల డ్రైవింగ్ సస్పెన్షన్ 
  • ఇన్సూరెన్స్ చేయించపోతే - 2000
  • అంబులెన్సు దారి ఇవ్వపోతే-10,000
  • పిల్లలు నడిపితే సంరక్షులకు శిక్ష-25,000+ 3 ఏళ్ల జైలు+లెసెన్సు రద్దు 
  • సీటు బెల్టు - 1000
  • ఏగ్రిగేటర్స్ లైసెన్సు ఉల్లంఘన - 1,00,000

తెలంగాణకు 5 స్వచ్ఛ్‌ మహోత్సవ్‌ పురస్కారాలు

తెలంగాణను వివిధ విభాగాల్లో 5 స్వచ్ఛ్‌ మహోత్సవ్‌ పురస్కారాలు వరించాయి.
* మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, వ్యక్తిగత విభాగంలో అవార్డులు ప్రకటించింది.
* జిల్లాల స్థాయిలో పెద్దపల్లి, వరంగల్, ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల శాంతక్కపల్లికి చెందిన మొరపు రమకు అవార్డులు దక్కాయి.
* ఇక రాష్ట్రాల స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణకు అవార్డు దక్కింది.జూన్ 24న  ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేతుల మీదుగా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌, పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేన అవార్డులు అందుకున్నారు.

2026లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం

2026లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం ఇవ్వబోతుంది 
ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్‌ ఒలింపిక్స్‌, మార్చి 6 నుంచి 15 వరకు వింటర్‌ పారాలింపిక్స్ జరుగుతాయి .
ఇవి ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో వీటిని నిర్వహించబడతాయని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అధికారికంగా ప్రకటించారు.
ఈ ఆటల అతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్‌ బిడ్‌ దాఖలు చేయగా, ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు.
ఇప్పటివరకు ఇటలీ రెండుసార్లు 1956, 2006లో వింటర్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించింది.

మౌరిటానియా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ జనరల్ మొహమ్మద్ ఔల్డ్ గజౌని విజయం

  • మౌరిటానియా, వాయువ్య ఆఫ్రికాలోని దేశం మాజీ జనరల్ మరియు రక్షణ మంత్రి, యూనియన్ ఫర్ రిపబ్లిక్ (యుపిఆర్) పార్టీకి చెందిన మొహమ్మద్ ఔల్డ్ గజౌని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
  • అతను 52% ఓట్లతో గెలిచాడు.
  • అతను మొహమ్మద్ ఔల్డ్ అబ్దేల్ అజీజ్ తరువాత విజయం సాధించాడు.
  • బానిసత్వ వ్యతిరేక కార్యకర్త బీరామ్ దాహ్ అబీద్ 18.58% ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.
  • సిడి మొహమ్మద్ ఔల్డ్ బౌబాకర్ అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీ 17.87% ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది.
  • 60 సంవత్సరాలలో మొదటిసారి మౌరిటానియా ఎన్నికలను ఎదుర్కొంది.

భారతదేశపు మొదటి ఇనుప ఖనిజం గని

భారతదేశపు మొదటి ఇనుప ఖనిజం గని బంగ్లాదేశ్‌లో కనుగొనబడింది
దీనాజ్‌పూర్‌లోని ఇసాబ్‌పూర్ గ్రామంలో ఇనుప ఖనిజం గని కనుగొనబడిందని బంగ్లాదేశ్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది 
ఈ ప్రాంతంలో రెండు నెలలకు పైగా విస్తృతమైన డ్రిల్లింగ్ తరువాత 400 అడుగుల మందపాటి ఇనుప పొర కనుగొనబడింది.
6-10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,750 అడుగుల ఉపరితలం క్రింద విస్తరించి ఉంది.
గనిలో ఇనుము శాతం 65.
ఇది ధాతువు యొక్క అధిక నాణ్యతను సూచిస్తుంది. కెనడా, చైనా, బ్రెజిల్, స్వీడన్ మరియు ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలలో ఇనుప ఖనిజం శాతం 50 స్థాయి కంటే తక్కువగా ఉంది.
మైనింగ్ యొక్క వివిధ స్థాయిలలో బంగారం, రాగి, నికెల్ మరియు క్రోమియం వంటి ఇతర ఖనిజాలు కూడా కనిపిస్తాయి.
ఇనుప గని యొక్క ఆవిష్కరణ దేశానికి ఆర్థిక అవకాశాలను తెరిచింది.
మాగ్నెటైట్ ధాతువులో ఇనుము సాంద్రత 65 శాతం.

ఆపరేషన్ సంకల్ప్‌

భారత నావికాదళం పెర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్‌లో ‘ఆపరేషన్ సంకల్ప్’ ను ప్రారంభించింది.
ఈ ప్రాంతం గుండా ప్రయాణించే భారతీయ ఫ్లాగ్డ్ ఓడల సురక్షిత మార్గానికి భరోసా ఇవ్వడం వారి ప్రధాన లక్ష్యం.
ఈ విస్తరణ ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన సముద్ర సంఘటనలపై ఆధారపడి ఉంటుంది.
సముద్ర భద్రతా కార్యకలాపాలను చేపట్టడానికి ఈ ప్రాంతంలో ఐఎన్ఎస్ చెన్నై మరియు ఐఎన్ఎస్ సునాయనా మోహరించింది.
ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఈ ప్రాంతంలో వైమానిక నిఘా.
భారత నావికాదళానికి చెందిన ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-హిందూ మహాసముద్రం ప్రాంతం (ఐఎఫ్‌సి-ఐఓఆర్) గల్ఫ్ ప్రాంతంలో ఓడల కదలికపై నిఘా పెట్టింది.

ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షలు

అమెరికా ఇరాన్‌పై మరోసారి తాజాగా ఆంక్షల్ని విధించింది.ఇటీవల అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. సదరు నిర్ణయానికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూన్ 24న సంతకం చేశారు.ఇరాన్‌పై కఠినతరమైన ఆంక్షల్ని విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.ఇరాన్‌తో, మరేతర దేశంతో సంక్షోభ పరిస్థితుల్ని తాము కోరుకోవడం లేదన్నారు.ఇరాన్‌ వద్ద అణ్వాయుధాన్ని ఉండనీయబోమని స్పష్టం చేశారు. 

ఐడీబీఐలో 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ - ఎ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారు పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సు చదవాల్సి ఉంటుంది. విజయవంతంగా ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో కోర్సులోకి ఎంపిక చేస్తారు.
బ్యాంకులో విధులు నిర్వహించటానికి అవసరమైన  శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు
అర్హత : డిగ్రీ 
ఎంపిక  ఆన్‌లైన్‌ పరీక్షద్వారా మరియు  ఇంటర్వ్యూ
 ఈ రెండింటిలో చూపిన ప్రతిభ ద్వారా పీజీ డిప్లొమా కోర్సులోకి తీసుకుంటారు.

ఆన్‌లైన్‌ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులు.
రెండు గంటల వ్యవధి
 ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు.
ప్రతి తప్పు జవాబుకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 60,
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 40,
 క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40,
 జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 60 ప్రశ్నలు
. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే
మొత్తం ఖాళీలు: 600 (అన్‌ రిజర్వ్‌డ్‌ 273, ఓబీసీ 162, ఎస్సీ 90, ఎస్టీ 45, ఈడబ్ల్యుఎస్‌ 30)
విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జూన్‌ 1, 2019 నాటికి 21- 28 ఏళ్ల లోపు ఉండాలి.
(అంటే జూన్‌ 2, 1991 కంటే ముందు; జూన్‌ 1, 1998 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి)
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జులై 21,
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: జులై 3
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. మిగిలిన అందరికీ రూ.౭౦౦
మరిన్ని వివరాలకు
వెబ్‌సైట్‌: https://www.idbibank.in/index.asp

శాశ్వత నివాస పథకం

 సంపన్నులైన విదేశీయులను ఆకర్షించాలని  సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక  సరికొత్త  పథకాన్ని ప్రకటించింది. దాని పేరు శాశ్వత నివాస అనుమతి పతకం ..ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో   ఈ పథకాన్ని ప్రకటించినట్లు భావిస్తున్నారు. కొత్త పథకంలో భాగంగా సుమారు రూ.21 కోట్లు (8 లక్షల రియాళ్లు లేదా 2.13 లక్షల అమెరికా డాలర్లు) చెల్లిస్తే సౌదీలో శాశ్వత నివాస అనుమతి పొందగలరని సౌదీ ప్రభుత్వం తెలిపింది . రూ.27 లక్షలు (లక్ష రియాళ్లు లేదా 27వేల అమెరికా డాలర్లు) చెల్లిస్తే ఒక  సంవత్సరం ఉండేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. సౌదీ ప్రాయోజకులు లేని విదేశీయులకు, సౌదీలో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి, ఆ దేశంలో స్థిరాస్తులు కొనడంతో పాటు.. బంధువులకు ప్రాయోజిత వీసాలు సమకూర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని  భావిస్తున్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...