కరెంట్ అఫైర్స్ 2 అక్టోబరు 2019 Wednesday
జాతీయ వార్తలు
సబర్మతి ఆశ్రమానికి నేడు ప్రధాని మోదీ :
i.
మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ బుధవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపితకు ఘనంగా నివాళులర్పించనున్నారు.
ii. ఆ తర్వాత సబర్మతి నది సమీపంలో 20వేల మందితో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. భారత్ను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) దేశంగా ఈ సదర్భంగా ప్రకటిస్తారు.
UNESCO,
DD Join Hands for TV Show on Gandhi’s 150th Anniversary :
i.
యునెస్కో
(ఐక్యరాజ్యసమితి విద్యా,
శాస్త్రీయ మరియు
సాంస్కృతిక సంస్థ)
మరియు దేశ
ప్రజా సేవా
ప్రసార దూరదర్శన్
టీవీ ద్విభాషా
కార్యక్రమం ‘మహాత్మ
లైవ్స్’ లేదా
‘బాపు జిందా
హై’ ను
1-2 అక్టోబర్
2019 న ప్రసారం
చేయడానికి చేతులు
కలిపారు.
ii. యునెస్కో
మరియు దూరదర్శన్
దేశ పితామహుడు
మహాత్మా గాంధీ
150 వ జయంతిని
పురస్కరించుకుని
టీవీ ద్విభాషా
కార్యక్రమాన్ని ప్రసారం
చేయనున్నారు.
iii. ఈ
కార్యక్రమం యొక్క
లక్ష్యం అతని
ఆలోచనలు మరియు
బోధనలను జరుపుకోవడం
మరియు ఇది
భారతదేశంతో పాటు
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న ప్రజల
జీవితాలను ఎలా
రూపొందించింది.
Gandhi
Film Festival to be organised in Mumbai :
i.
ఇండియా
టూరిజం సహకారంతో
ఫిల్మ్ డివిజన్
2019 అక్టోబర్
2 నుండి 6 వరకు
ముంబైలో “గాంధీ
ఫిల్మ్ ఫెస్టివల్”
నిర్వహించనుంది.
ii. ఈ
చలన చిత్రోత్సవం
మహాత్మా గాంధీ
యొక్క 150 వ
జన్మదిన వేడుకల్లో
ఒక భాగం
మరియు గాంధీజీ
అహింస సందేశం
మరియు స్వచ్ఛ
భారత్ పై
దృష్టి పెడుతుంది.
iii. ఎంపిక
చేసిన డాక్యుమెంటరీలు
మరియు చలన
చిత్రాలు ఫిల్మ్స్
డివిజన్ కాంప్లెక్స్లో
ప్రదర్శించబడతాయి.
వీటిలో ది
మేకింగ్ ఆఫ్
మహాత్మా, గాంధీ,
గాంధీ మై
ఫాదర్ మరియు
మైనే గాంధీ
కో నహిన్
మారా ఉన్నాయి.
తెలంగాణ వార్తలు
విద్య పట్టదు.. వైద్యం గిట్టదు.. వీటిపై అతి తక్కువ ఖర్చుపెడుతున్న తెలంగాణ. రైతుబంధు పథకం భేష్: ఆర్బీఐ గణాంకాల వెల్లడి
i.
విద్య, వైద్య రంగాలపై దేశంలో అతితక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రిజర్వ్బ్యాంక్ మంగళవారం విడుదలచేసిన రాష్ట్రాల ఆర్థిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై 6.6%, వైద్యరంగంపై 3.5% మాత్రమే ఖర్చుపెడుతున్నట్లు తేలింది.
ii. రుణమాఫీ కాకుండా రైతులకు ఆర్థిక మద్దతు (రైతు బంధు) ప్రకటించిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు ప్రత్యేక ఘనత దక్కుతుందని, ప్రధానమంత్రి కిసాన్ పథకం కంటే ముందుగానే తెలంగాణ ఈ వినూత్న పథకాన్ని ప్రకటించిందని ఆర్బీఐ ప్రశంసించింది.
iii. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం (రెవెన్యూ రిసీట్స్) 2017-18లో రూ. 88,824 కోట్లు ఉండగా, 2019-20 నాటికి రూ. 1,13,099కి చేరింది. ఇదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ. 85,364.7 కోట్ల నుంచి రూ. 1,11,055కి పెరిగింది. 2017-18లో రెవెన్యూ మిగులు రూ. 3,459 కోట్లు ఉండగా, 2019-20 నాటికి అది రూ. 2,044కి తగ్గింది.
iv. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మొత్తం 2018-19 నాటికి రూ. 77,314 కోట్లకు చేరింది. దేశంలో మరే రాష్ట్రమూ ఇంత పెద్ద ఎత్తున గ్యారెంటీలు ఇవ్వలేదు.
v. దీని తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 2018-19 సంవత్సరం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ కలిపి రూ. 1.57 లక్షల కోట్లకు గ్యారెంటీలు ఇవ్వగా అందులో తెలంగాణా వాటా 49% ఉంది.
పుర ఎన్నికలకు సిద్ధమే. కసరత్తు చేస్తున్న పురపాలక శాఖ. సిద్ధంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం :
i.
కొత్త పురపాలక చట్టంలో రిజర్వేషన్లు గరిష్ఠంగా 50 శాతమని స్పష్టత రావడంతో ఈ మేరకు ఎన్నికలు జరగాల్సిన అన్ని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించారు.
‘జలశక్తి’లో సంగారెడ్డి జిల్లా ఘనశక్తి. జాతీయ స్థాయిలో 2వ స్థానం :
i.
జలశక్తి అభియాన్లో జాతీయ స్థాయిలో సంగారెడ్డి జిల్లాకు రెండో స్థానం దక్కింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ చేపట్టాల్సిన జల సంరక్షణ చర్యలపై సూచనలు చేయాలని కేంద్రం గతంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ii. బృంద సభ్యులు జులైలో జిల్లాలో పర్యటించి జల సంరక్షణకు పలు సూచనలు చేశారు. వారి సూచనలు పాటిస్తూ జిల్లా యంత్రాంగం చెక్డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టింది.
iii. జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంఘం, అమీన్పూర్, కల్హేర్, పటాన్చెరు మండలాల్లో జలసంరక్షణ చర్యలను బృందం ప్రశంసించింది. నివేదికను సమర్పించగా దాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డికి ద్వితీయ ర్యాంకు ప్రకటించింది.
ఇతర
రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
ఏపీలో సచివాలయ పాలనకు నేడు (Oct 2) శ్రీకారం. కరపలో ప్రారంభించనున్న సీఎం :
i.
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ వ్యవస్థ నేటి నుంచి అమలులోకి రానుంది. తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థను ప్రారంభిస్తారు.
ii.
గ్రామ, వార్డు కార్యదర్శిలకు గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందజేస్తారు. ప్లాస్టిక్ నిషేధంపై ఆహుతులతో ప్రతిజ్ఞ చేయిస్తారు.
‘కోటి’ వెలుగుల్లో 28.88 లక్షలు ఏపీవే :
i.
దేశవ్యాప్తంగా కోటి స్మార్ట్ ఎల్ఈడీ వీధిదీపాలను అమర్చితే అందులో 28.88లక్షలు ఆంధ్రప్రదేశ్వే కావటం విశేషమని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్.కె.సింగ్ ప్రశంసించారు. కోటి ఎల్ఈడీ వీధిదీపాలను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని మంగళవారం(Oct 1) దిల్లీలో నిర్వహించారు.
ii. ఈ సందర్భంగా హరియాణాలోని గురుగ్రామ్ నగరపాలిక పరిధిలో ఏర్పాటుచేసిన 64,418 వీధిదీపాలను మంత్రి ఆర్.కె.సింగ్ రిమోట్ కంట్రోల్తో ప్రారంభించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా కోటి ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చినట్లయింది.
iii. 28,88,892 ఎల్ఈడీ వీధిదీపాలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. 10.30లక్షలతో రాజస్థాన్ ద్వితీయ, 9.30లక్షలతో ఉత్తరప్రదేశ్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో 8,92,764 స్మార్ట్ ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చారు.
ఉప సమరం.. ప్రతిష్ఠాత్మకం.. 17
రాష్ట్రాల్లో ఎన్నికలు :
i.
దేశవ్యాప్తంగా
17 రాష్ట్రాలు, ఒక
కేంద్రపాలిత ప్రాంతంలో
ఉప ఎన్నికలు
జరుగుతున్నాయి. కర్ణాటకలోని
15 అసెంబ్లీ స్థానాలకు
డిసెంబరు 5న,
మిగతా చోట్ల
51 అసెంబ్లీ నియోజకవర్గాలు,
2 లోక్సభ
స్థానాలకు ఈనెల
21న పోలింగ్
జరుగుతుంది.
ii.
ఓట్ల
లెక్కింపు కర్ణాటకలో
డిసెంబరు 9న,
మిగతా ప్రాంతాల్లో
ఈనెల 24న
నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఎన్నికలతో పాటే అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోరుకు కూడా తెర లేచింది.
iii.
2022లో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో భాజపా ఎమ్మెల్యేలు పలువురు గెలుపొందడంతో ఎక్కువ స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే ఫగూసింగ్ చౌహాన్ బిహార్ గవర్నర్గా నియమితులు కావడంతో ఘోసీ స్థానం ఖాళీ అయింది.
iv.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (భాజపా), శివసేనల మధ్య పొత్తు ఖరారైంది. మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి జట్టుగా బరిలోకి దిగుతున్నట్లు భాజపా వెల్లడించింది.
మైసూరు సంబరాలకు సింధు శ్రీకారం :
i.
చారిత్రక మైసూరు దసరా క్రీడోత్సవాలను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ప్రారంభించారు.
ii.
ముఖ్య అతిథిగా వీటిలో పాల్గొనడం, తొలిసారి మైసూరు నగరాన్ని సందర్శించటం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
అంతర్జాతీయ వార్తలు
కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి 70 వసంతాలు పూర్తి. సైనిక సత్తాను చాటుతూ చైనా భారీ కవాతు :
i.
చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టి 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం(October 1) ఘనంగా వేడుకలు జరిగాయి. సైనిక సత్తాను చాటుతూ బీజింగ్లో భారీ కవాతును ప్రభుత్వం నిర్వహించింది.
ii.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) నేతృత్వంలో ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (పీఆర్సీ) ఏర్పడటం వల్ల దేశ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయన్నారు.
iii.
జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని చైనా ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. రెండు దేశాల మధ్య మైత్రి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
iv. చైనా సంబరాల్లో మునిగిపోయిన వేళ హాంకాంగ్ నిరసనలతో అట్టుడికింది. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం 70వ వార్షికోత్సవాన్ని హాంకాంగ్లోని ప్రజాస్వామ్యవాదులు ‘విషాద దినం’గా ప్రకటించారు. స్వయం ప్రతిపత్తి, ఓటు హక్కు, అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఆర్థిక అంశాలు
చేతులు కలిపిన మహీంద్రా, ఫోర్డ్. సంయుక్త సంస్థ ఏర్పాటు :
i.
భారత్లో వినియోగ వాహనాలు (యూవీ), స్పోర్ట్స్ వినియోగ వాహనాల (ఎస్యూవీ) తయారీ కోసం అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ (ఎఫ్ఎంసీ), భారత దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) సంయుక్త సంస్థ (జేవీ)ను ఏర్పాటు చేశాయి.
ii.
ఈ జేవీలో ఎం అండ్ ఎంకు 51 శాతం, ఫోర్డ్కు 49 శాతం వాటా ఉంటాయి. కార్లు, ప్రయాణికుల వాహనాల తయారీలో 14 శాతం వాటాతో మూడో అతిపెద్ద సంస్థగా ఈ జేవీ నిలవనుంది.
వినియోగదారుల ఫిర్యాదులకు ‘కన్జూమర్ యాప్’ :
i.
వినియోగదారులు తమ సమస్యలు సులభంగా నమోదు చేయడంతో పాటు, 15-60 రోజుల్లో పరిష్కారం పొందేందుకు అనువైన ప్రత్యేక యాప్ను ప్రభుత్వం ఆవిష్కరించింది.
ii.
సులభంగా పరిష్కరించే అంశాలను 15 రోజుల్లో, క్లిష్టమైన అంశాలను 60 రోజుల్లో పరిష్కరించేందుకు వీలుగా ‘కన్జూమర్ యాప్’ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లతో పనిచేసే స్మార్ట్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
iii.
ఆంగ్లం, హిందీ భాషల్లో వినియోగానికి వీలున్న ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశవాన్ తెలిపారు.
iv.
విమానయానం, బ్యాంకింగ్, బీమా వంటి 42 రంగాల్లో సమస్యలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం తొలుత నమోదు కావాలి. ప్రభుత్వానికి సూచనలు కూడా చేయొచ్చు. నీ రిఫండ్ నిబంధనల వంటివీ ఈ యాప్లో ఉంటాయి.
SBI becomes first Indian bank to have office in
Australia’s Victoria :
i.
స్టేట్
బ్యాంక్ ఆఫ్
ఇండియా తన
మెల్ బోర్న్
కార్యాలయాన్ని ప్రారంభించింది
మరియు ఆస్ట్రేలియా
రాష్ట్రమైన విక్టోరియాలో
ఒక శాఖను
కలిగి ఉన్న
మొదటి భారతీయ
బ్యాంకుగా అవతరించింది.
ii. మెల్
బోర్న్ కార్యాలయం
విక్టోరియా మరియు
భారతదేశం మధ్య
పెరుగుతున్న వాణిజ్య
మరియు పెట్టుబడి
సంబంధాలకు సహాయం
చేస్తుంది మరియు
ఇది రాష్ట్ర
10 సంవత్సరాల ఇండియా
స్ట్రాటజీ యొక్క
ఫలితం.
iii. భారతదేశం
యొక్క అతిపెద్ద
వాణిజ్య బ్యాంకు
ఈ పెట్టుబడి
మా అభివృద్ధి
చెందుతున్న ఆర్థిక
సేవల రంగానికి
మరియు మా
అత్యంత నైపుణ్యం
కలిగిన శ్రామికశక్తికి
నిదర్శనం.
BOOKS
‘జ్వలిత
దీక్ష’ – By విజయ్కుమార్
i.
సీఎం పీఆర్వో విజయ్కుమార్ రాసిన ‘జ్వలిత దీక్ష’ పుస్తకం ద్వితీయ ముద్రణను ప్రగతి భవన్లో కేసీఆర్ ఆవిష్కరించారు.
ii.
2009లో నేను నిరాహార దీక్ష చేపట్టినప్పుడు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో నెలకొన్న పరిస్థితులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భావోద్వేగ సన్నివేశాలను జ్వలిత దీక్ష పుస్తకంలో రచయిత గొప్పగా అక్షరీకరించారు అని కేసీఆర్ అన్నారు.
గాంధీ, మహాత్మాగాంధీ ఇన్ తెలంగాణ – By అడపా సత్యనారాయణ
i.
అడపా సత్యనారాయణ రాసిన తెలంగాణలో గాంధీ, మహాత్మాగాంధీ ఇన్ తెలంగాణ పుస్తకాలనూ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
వాల్డెన్ – By హెన్రీ డేవిడ్ థోరో
i.
హెన్రీ డేవిడ్ థోరో అమెరికన్ రచయిత, కవి, తార్కికుడు. ఆయన రాసిన ‘వాల్డెన్’ పుస్తకం గాంధీని అమితంగా ప్రభావితం చేసింది. నిరాడంబర జీవితం, ప్రకృతితో సహవాసం తదితర అంశాలకు ఆ పుస్తకం ప్రతిబింబంగా ఉంటుంది.
ii.
రెండు సంవత్సరాల పాటు తాను ప్రకృతి ఒడిలో ప్రత్యక్షంగా అనుభవించిన సామాన్య జీవన విధానం గురించి తన ప్రతిస్పందనలను రాయడం ద్వారా తన తాత్విక ఆలోచనలకు థోరో ఆచరణాత్మకతను కల్పించారు.
iii.
ప్రకృతి, రాజకీయాలు, పౌరసత్వం లాంటి అంశాలపై బలమైన ఆలోచనలను విశ్లేషించారు. మసాచుసెట్స్ జైల్లో ఒక రాత్రి గడిపిన ఆయన ‘శాసనోల్లంఘన’ పైనా మరో పుస్తకం రాశారు. కేవలం రాయడమే కాదు.. ఆచరణలోనూ చూపించారు.
iv.
పౌర ఉల్లంఘన సిద్ధాంతం మహాత్మా గాంధీ, లియో టాల్స్టాయ్, మార్టిన్ లూథర్కింగ్ జూనియర్ లాంటి పలువురి రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేసింది. బాపూజీలాగే థోరో కూడా అహింసావాది.
v.
రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీలను వ్యతిరేకించిన చాలామంది థోరో వ్యాసాన్నే ఆయుధంగా స్వీకరించి, దాన్ని సమర్థంగా ఉపయోగించారు.
ముఖ్యమైన రోజులు
2 October - 150th Gandhi Jayanti









2 October -
International Day of Non-Violence (అంతర్జాతీయ అహింసా దినం)





లాల్ బహాదుర్ శాస్త్రి 115వ జయంతి - అక్టోబర్ 2
i.
లాల్ బహాదుర్ శాస్త్రి (1904 అక్టోబర్ 2 - 1966 జనవరి 11) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు.
ii. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో
తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
iii. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు.
iv. నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం
"జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది.
v. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్ లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ
అది CIA (Central
Intelligence Agency) ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన
హత్యగా చెప్పబడింది.
vi. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1947
ఆగస్టు 15 న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరాడు. అతను రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించాడు.
vii. 1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు.
viii. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై
విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు.
ix.
శాస్త్రి నిజాయితీ పరుడు, మానవతావాదిగా పేరొందాడు. మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందిన వ్యక్తులలో మొదటివాడు. న్యూఢిల్లో లో "విజయ్ ఘాట్" పేరుతో అతనికి స్మారక స్థలముంది. అతని పేరుతో లాల్ బహాదుర్ శాస్త్రి అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విద్యాసంస్థను ముస్సోరీ, ఉత్తరఖండ్ లో నెలకొల్పారు.
క్రీడలు
ఎంసీసీ అధినేతగా
ఎంపికైన తొలి
బ్రిటీషేతర వ్యక్తి
అధ్యక్షుడిగా కుమార
సంగక్కర :
i.
మెరీల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర బాధ్యతలు చేపట్టాడు.
ii.
ఎంసీసీ అధినేతగా ఎంపికైన తొలి బ్రిటీషేతర వ్యక్తి సంగనే. ఈ పదవిలో అతను ఏడాది పాటు కొనసాగుతాడు.
Japan’s Kento Momota wins Korea Open :
i.
కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జపాన్కు చెందిన కెంటో మోమోటా కైవసం చేసుకుంది. తైవాన్కు చెందిన రెండవ స్థానంలో ఉన్న చౌ టియెన్-చెన్పై విజయం సాధించింది.
ii.
మహిళల ఫైనల్లో, చైనా యొక్క హి బింగ్జియావో థాయ్లాండ్కు చెందిన రాట్చానోక్ ఇంటానాన్ను ఓడించాడు.
Mercedes’ Lewis Hamilton won 2019
Russia F1 Grand Prix :
i.
రష్యాలోని సోచి ఆటోడ్రోమ్ రేస్ ట్రాక్లో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ మెర్సిడెస్కు చెందిన లూయిస్ హామిల్టన్ 2019 రష్యా ఎఫ్ 1 గ్రాండ్ ప్రిక్స్ (ఫార్ములా 1 జిపి) గెలుచుకున్నాడు.
ii.
మెర్సిడెస్ వాల్టెరి బొటాస్ (ఫిన్లాండ్) మరియు ఫెరారీ యొక్క చార్లెస్ లెక్లెర్క్ (మొనాకో) వరుసగా రెండవ మరియు మూడవ స్థానాలను గెలుచుకున్నారు. ఈ విజయం హామిల్టన్ కెరీర్లో 82 వ, మరియు ఈ సీజన్లో తొమ్మిదవది, మైఖేల్ షూమేకర్ యొక్క ఆల్-టైమ్ రికార్డ్ 91 కి తొమ్మిది తక్కువ.
No comments:
Post a Comment