Friday, 5 July 2019

పారిశ్రామికవేత్త బీకే బిర్లా కన్నుమూత

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిర్లా గ్రూప్ వ్యవస్థాపకుడు బసంత్ కుమార్ బిర్లా(బీకే బిర్లా)(98) ఇకలేరు.
గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 3న ముంబైలో కన్నుమూశారు. భారత పారిశ్రామిక రంగానికి పునాదులు వేసిన దిగ్గజాల్లో ఒకరిగా పేర్కొనే బిర్లా తన 15వ సంవత్సరం నుంచీ వ్యాపార కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. సెంచురీ టెక్స్‌టైల్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు, కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...