Monday, 21 January 2019

పోలవరం ప్రాజెక్టుకు సీబీఐపీ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో జనవరి 4న జరిగిన కార్యక్రమంలో ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ ఈ అవార్డును అందజేశారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన పోలవరంను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది. 

క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలవరం ప్రాజెక్టుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : న్యూఢిల్లీ 
ఎందుకు : అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నందుకు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...