Monday, 4 February 2019

పద్మశ్రీ అవార్డు వెనక్కి

పౌరసత్వ సవరణ బిల్లు-2016కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావంగా మణిపుర్‌కు చెందిన ప్రఖ్యాత సినీ దర్శకుడు అరిబమ్‌శ్యామ్‌శర్మ(83) తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంఫాల్‌లోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మణిపుర్‌ ప్రజలు రక్షణ కోరుకుంటున్నారన్నారు.  ఈశాన్యరాష్ట్రాల గోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  భారతీయ సమాఖ్య అనేది రాష్ట్రాల కలయికతో ఏర్పడిందనేది మర్చిపోకూడదు. ఈశాన్య రాష్ట్రాలు ఉమ్మడిగా ఏదైనా కేంద్రానికి విన్నవిస్తే.. ప్రభుత్వం అంగీకరించాలి.’’ అని అరిబమ్‌ వ్యాఖ్యానించారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...