- భారతదేశ సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్యం, చట్టాలకు అందించిన సేవలకుగాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని గౌరవ డాక్టరేట్ వరించింది. ఐరాస ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘‘యూనివర్శిటీ ఆఫ్ పీస్’’ ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. కోస్టారికా రాజధాని సాన్జోస్లో జరిగిన కార్యక్రమంలో యూనివర్శిటీ డీన్ నుంచి ఆయన ‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ అందుకున్నారు.
- ఈ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
- శాంతి ప్రబోధకుడైన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ గౌరవాన్ని అందుకోవడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’’ అని ఆనందం వ్యక్తం చేశారు.
- 2017లో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆయన దేశంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాస్వామ్యం, చట్టాలు, సంకుచిత భావాల నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Sunday, 10 March 2019
ఉపరాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన ‘యూనివర్సిటీ ఆఫ్ పీస్’
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
No comments:
Post a Comment