ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, గొప్ప మానవతామూర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (86) శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు .గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబరు 13న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు సైతం ప్రముఖ రచయితే. కోట్ల విజయభాస్కరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పని చేశారు
No comments:
Post a Comment