Thursday, 27 June 2019

జల్‌శక్తి అభియాన్

దేశవ్యాప్తంగా 2019, జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు (ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబరు వరకు) ‘జల్‌శక్తి అభియాన్ (జేఎస్‌ఏ)’ అమలు చేయనున్నారు.జల్‌శక్తి అభియాన్‌లో భాగంగా దేశంలో తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్ అధికారులను నియమిస్తూ జూన్ 26న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. జల్‌శక్తి అభియాన్ ద్వారా జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...