Friday, 28 June 2019

ఏపీకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం

ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,264 కోట్ల (328 మిలియన్ డాలర్లు) రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.ఈ మేరకు ఢిల్లీలో జూన్ 27న జరిగిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచబ్యాంకు ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రుణ చెల్లింపునకు ఆరేళ్ల గ్రేస్ పీరియడ్‌తోపాటు 23.5 ఏళ్ల పరిమితి ఉంటుంది.ఈ రుణం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్యంగా గర్భిణులు, హైపర్ టెన్షన్, మధుమేహం, సర్వైకల్ క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడేవారికి మంచి వైద్యం అందుబాటులోకి రానుంది. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...