Tuesday, 25 June 2019

ఇండోనేసియాలో భారీ భూకంపం

ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. యందేనా ఐలాండ్‌లోని సోంలకీ సముద్ర తీరం వద్ద సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కెల్ పైన  7.5గా నమోదైంది. ఆదివారం రాత్రి 10.05 గంటల సమయంలో ఇది సంభవించినట్లు . ఇండోనేసియా ప్రభుత్వం తెలిపింది  ఇండోనేసియా ప్రభుత్వ వివరాల ప్రకారం యాంబన్‌ దక్షిణాన 321కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214కి.మీ లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30క్షణాల కంటే ఎక్కువగా  ఈ ప్రకంపనలు వచ్చాయి.  దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ సునామీ సంభవించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం తెలిపింది. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...