Friday, 28 June 2019

టీటీ టోర్ని సింగిల్స్ విజేతగా శ్రీజ

జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టీటీ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణకి చెందిన ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది.హరియాణాలోని సోనెపట్‌లో జూన్ 27న ముగిసిన ఈ టోర్నిలో ఆర్‌బీఐ తరఫున బరిలోకి దిగిన శ్రీజ ఫైనల్లో 6-11, 7-11, 14-12, 13-11, 11-9, 11-9తో సుతీర్థ ముఖర్జీ (హరియాణా)పై విజయం సాధించింది. దీంతో శ్రీజ తొలిసారి సీనియర్ స్థాయిలో విజేతగా నిలిచినట్లయింది. అలాగే జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా కూడా శ్రీజ గుర్తింపు పొందింది. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...