Friday, 13 September 2019

తెలంగాణలో ఈ-మ్యాగజైన్ ప్రారంభం

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ-మ్యాగజైన్(ఎడ్యుసర్)ను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది.హైదరాబాద్‌లో సెప్టెంబర్ 11న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ- మ్యాగజైన్(ఎడ్యుసర్)ను ఆవిష్కరించారు. ఈ- మ్యాగజైన్‌లో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశబోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు ప్రస్తావిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ ఎడిషన్‌ను ప్రదర్శిస్తారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం వీటిని చూసే అవకాశం ఉంటుంది.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...